April 23, 2026

టీటీడీ ట్రస్ట్ లకు రూ 11 లక్షలు విరాళం

సోమవారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ట్రస్టుకు దాతలు రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.

అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాధ్, కృష్ణకుమారి దంపతులు క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం చెక్కును ఆయనకు అందజేశారు.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 లక్ష విరాళం‌ కేటాయించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *