April 11, 2026

900 మంది చిన్నారులకు విముక్తి: హోం మంత్రి

HOME MINISTER ANITHA

HOME MINISTER ANITHA

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ట్రేస్’ ద్వారా 900 మంది పిల్లలను రక్షించినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొని ఈ కీలక వివరాలను పంచుకున్నారు.

AP CABINET: 31 భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి పచ్చ జెండా ఈ వార్తను కూడా చదవండి

రాష్ట్రంలో పోక్సో (POCSO) కేసుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి అనిత తెలిపారు. కొన్ని కేసుల్లో నిందితులకు బెయిల్ రాకముందే శిక్షలు పడేలా న్యాయవ్యవస్థతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ అధికారులు కలిసి పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ ట్రేస్ విజయవంతం కావడంతో పాటు, వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన మరో 180 మందిని కూడా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.

బలవంతపు కార్మిక వ్యవస్థను కూకటివేళ్లతో తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టిందని అనిత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి రక్షణ చర్యలను మరింత వేగవంతం చేస్తామని, పిల్లల రక్షణకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొని చట్టపరమైన అంశాలపై చర్చించారు.

#VangalapudiAnitha #OperationTrace #AndhraPradesh #ChildSafety #StopHumanTrafficking #APPolice #ChildLabourFreeAP #Governance

AP CABINET: 31 భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి పచ్చ జెండా ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *