August 21, 2026

తిరుపతిలో ఘనంగా రాష్ట్రస్థాయి శాప్ (SAAP) చెస్ లీగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ శనివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు మరియు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో క్రీడలను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ లీగ్ వేదికగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

క్రీడలకు కొత్త దిశ – శాప్ లీగ్ లక్ష్యం

కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధే లక్ష్యంగా SAAP లీగ్ రూపుదిద్దుకుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు కొత్త దిశ, కొత్త ఆలోచన కల్పించడమే ఈ లీగ్ ఉద్దేశం.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి, రానున్న రోజుల్లో శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

“ఇది కేవలం ఒక లీగ్ కాదు… ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు వేసిన పునాది” అని ఆయన ఉద్ఘాటించారు.

రికార్డు స్థాయిలో క్రీడాకారుల భాగస్వామ్యం

ఈ లీగ్ కోసం ఫిబ్రవరి 17, 2026న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అత్యుత్తమ క్రీడాకారులు ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో తమ మేధస్సుకు పదును పెడుతున్నారు.

#SAAPLeague #ChessLeague #RaviNaidu #Tirupati #APSports #PanabakaLakshmi #ChessChampionship #YouthEmpowerment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీకు ఆసక్తి కలిగించే వార్తలు