
సోమవారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ట్రస్టుకు దాతలు రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.
అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాధ్, కృష్ణకుమారి దంపతులు క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం చెక్కును ఆయనకు అందజేశారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 లక్ష విరాళం కేటాయించాలని కోరారు.