
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్లీ భాషా వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన Kubera movie promotions కు సంబంధించిన ఫోటోలు మరియు క్యాప్షన్ వల్ల కన్నడిగుల ఆగ్రహానికి గురవుతోంది. “నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం,” అంటూ చెన్నైపై తన స్నేహం మరియు స్మృతులను పంచుకున్న రష్మిక, తమిళనాడు ప్రజలకు తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.
ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన పోస్ట్లో, రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. “చెన్నైలో నేను చిన్నప్పుడు ఉండేవాళ్లం. నాన్న అక్కడ పనిచేసేవాడు. రస్కిన్ పాఠశాలలో చదివాను. ఇప్పుడు ఆ స్కూల్ ఉందో లేదో తెలియదు. అక్కడే నేను మొదట తమిళం నేర్చుకున్నాను,” అంటూ రాసింది. అలాగే కుబేర ప్రమోషన్లను చెన్నైలో ప్రారంభించామంటూ చెప్పింది.
ఈ వ్యాఖ్యలపై అనేకమంది కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “రష్మిక, నువ్వు కన్నడిగివి కదా, మరి తమిళమే నీ మొదటి భాష ఎలా అవుతుంది?” అంటూ ఆమెపై మండిపడుతున్నారు. గతంలో కూడా Pushpa ప్రమోషన్ల సమయంలో కన్నడ మీడియాకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విమర్శలు ఎదుర్కొన్న రష్మిక, ఇప్పుడు మరోసారి వివాదంలో పడింది.
ఇక చెన్నైలో జరిగిన కుబేర గ్రాండ్ ఈవెంట్ లో నాగార్జునతో కలిసి రష్మిక పాల్గొంది. ఇద్దరూ కలిసి మాట్లాడుతున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రష్మిక ఇప్పటికే దక్షిణాదిలో అన్నీ భాషల సినిమాల్లో నటించి స్టార్గా ఎదిగింది. తాజాగా కోలీవుడ్లో ధనుష్ హీరోగా నటిస్తున్న Kubera సినిమాలో నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.