- తిరుగుబాటుదారులపై పాక్ బలగాల దాడులు
ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్న పాకిస్తాన్ భద్రతా దళాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా (KP) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటిలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు (IBOs) నిర్వహించి తొమ్మిది మంది తిరుగుబాటుదారులను మట్టుబెట్టాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ దాడులు ప్రాంతంలో అల్లకల్లోం నెలకొంది.
పాకిస్తాన్ సైనిక సమాచార విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మూడు భిన్న ప్రాంతాల్లో ఈ చర్యలు చోటుచేసుకున్నాయి. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఘర్షణలో నలుగురు హతమయ్యారు. టాంక్ జిల్లాలో జరిగిన మరో ఆపరేషన్లో ఇద్దరు మృతి చెందారు. ఖైబర్ గిరిజన జిల్లాలోని బఘ్ ప్రాంతంలో జరిగిన మూడో దాడిలో మిగిలిన ముగ్గుర్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
హతుల వద్ద నుండి ఆయుధాలు మరియు వైద్య సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆ ప్రాంతాల్లో పలు కార్యకలాపాల్లో నిష్ణాతులుగా ఉన్నట్లు ISPR వెల్లడించింది. ఈ దాడుల అనంతరం మిగిలిన ముప్పును కూడా నిరోధించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పాక్ భద్రతా బలగాలు ఉగ్రవాదాన్ని దేశం నుంచి సమూలంగా తొలగించేందుకు కట్టుబడి ఉన్నాయని సైనిక శాఖ స్పష్టం చేసింది. హతులపై కొన్నికొన్ని అధికారిక వర్గాలు “భారత మద్దతుతో పనిచేసే ఖవారిజ్” అనే పదాన్ని వాడటం గమనార్హం. టీటీపీ (తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్) వంటి ముఠాలతో సంబంధాలు ఉన్న విదేశీ మద్దతుతో నడిచే ఉగ్రవాదులపై ఇది వేటగా అభివర్ణించారు.
ఈ ఆపరేషన్లలో భద్రతా బలగాలకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో హింస కార్యకలాపాలు తరచూ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చర్చకు దారి తీస్తున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.