
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 23 నుండి 28వ తేదీ వరకు జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
మే 23 (శుక్రవారం) – ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం, హారతి జరుగుతుంది.
మే 24 – ఉదయం 9 నుండి 12 వరకు యాగశాల వాస్తు, అకల్మష హోమం, రక్షాబంధనం; సాయంత్రం 6 నుండి 8.30 వరకు అగ్ని ప్రతిష్ట, కళాకర్షణ, ఉక్త హోమాలు జరుగుతాయి.
మే 25 – ఉదయం పంచగవ్యాది వాసం, క్షీరాది వాసం, యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి; సాయంత్రం కూడా వైదిక కార్యక్రమాలు, హారతి నిర్వహిస్తారు.
మే 26 – ఉదయం రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన శిఖర స్థాపన, బింబస్థాపన, అష్టబంధన, ద్రవ్యారాధన సమర్పణ, హారతి జరుగుతుంది. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి.
మే 27 – ఉదయం బింబ వాస్తు, నవకలశ స్థాపన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, హారతి; సాయంత్రం మహాశాంతి హోమాలు, పూర్ణాహుతి, శయనాది వాసం, విశేష హోమాలు నిర్వహించనున్నారు.
మే 28 – తెల్లవారుఝామున సుప్రభాతం, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ఆచార్య బహుమానం, ధ్వజారోహణం, హారతి జరుగుతాయి. సాయంత్రం 4 నుండి 7 వరకు కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణంతో సంప్రోక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి.