March 25, 2026

లేబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక మారణహోమం

ISRAEL WAR

ISRAEL WAR

అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ లేబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు రక్తాన్ని ఓడిస్తున్నాయి. దక్షిణ లేబనాన్‌లోని నివాస ప్రాంతాలు, శరణార్థి శిబిరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సిడాన్ సమీపంలోని శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో పలువురు మరణించగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధోన్మాదం లేబనాన్ అంతటా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.

సిడాన్ సమీపంలోని మీహ్ మీహ్ శరణార్థి శిబిరంలో ఒక నివాస ఫ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. శాంతియుతంగా తలదాచుకుంటున్న శరణార్థి కుటుంబాలపై జరిగిన ఈ బాంబు దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రజల్లో భయాన్ని నింపడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడుతోందని స్థానిక వార్తా సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

లేబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ నెల ప్రారంభం నుండి జరుగుతున్న దాడుల్లో మరణాల సంఖ్య వెయ్యి దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటివరకు కనీసం 1,072 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2,966 మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోగా, నిత్యావసరాలు అందక వేలాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు.

సిడాన్ జిల్లాలోని అడ్లౌన్ పట్టణంలో ఇజ్రాయెల్ జరిపిన మరో వైమానిక దాడిలో నలుగురు పౌరులు మరణించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు నబాటియా జిల్లాలోని హబూష్ పట్టణంపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వరుస దాడులతో లేబనాన్ లోని ప్రధాన నగరాలన్నీ ధ్వంసమవుతున్నాయి.

నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడులను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యుద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాన్య ప్రజలను పొట్టనబెట్టుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నా, దాడులు మాత్రం ఆగడం లేదు. శరణార్థి శిబిరాల వంటి రక్షిత ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Lebanon #Israel #WarNews #HumanRights #Sidon #MiddleEastCrisis #Airstrike #GlobalNews #PeaceForLebanon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *