

విజయవాడ, జూన్ 4: ప్రతి గ్రామంలో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (Pre-Monsoon Dry Sowing) విధానాన్ని అమలు చేయాలని, పచ్చని నేలతో రైతుకు ఆదాయం, భూమికి ఆరోగ్యం వచ్చేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం రైతు సంక్షేమానికి ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 26 జిల్లాలలో మూడు రోజులపాటు జరిగే ప్రకృతి వ్యవసాయం శిక్షణా కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటిలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు సాధికార సంస్థ ఈ శిక్షణ ద్వారా 10 వేల మందికి పైగా ఉన్న Village Agriculture Assistants (VAA), Village Horticulture Assistants (VHA) కు Natural Farming పై అవగాహన పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. Field visitsతో కూడిన ఈ శిక్షణ ప్రత్యేకంగా రూపొందించబడింది.
ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీ రావు, హార్టీకల్చర్ డైరెక్టర్ డాక్టర్ నివాసులు, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి. విజయ్ కుమార్, సీఈఓ రామారావు, సలహాదారు డాక్టర్ డీవీ రాయుడు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ విభాగాధిపతుల సెషన్లను కూడా ప్రత్యేకంగా సమకూర్చారు.
2025-26 నాటికి 15.40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మార్పులో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. బుడితి మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయం అనేక వ్యవసాయ సమస్యలకు సమగ్ర పరిష్కారం అని ఆయన చెప్పారు. నూతక్కి, వీరపనేనిగూడెం గ్రామాల రైతుల ప్రేరణాత్మక success stories ను ఉదాహరణగా చేర్చారు. Crop diversity, soil health, 365-day greenery, climate resilience వంటి పదాలను చర్చిస్తూ పద్ధతుల అమలులో శాస్త్రీయత కీలకం అన్నారు.
కౌలురైతులు, inputs, chemical fertilizers ధరలు పెరగడం వల్ల విపత్కర పరిస్థితి ఏర్పడిందని**, ప్రకృతి వ్యవసాయం వలన ఖర్చు తక్కువగా ఉంటుందని, భూమికి మరియు రైతుకు మేలు కలుగుతుందని అన్నారు.
రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వల్ల nutritional value పెరుగుతుందని, carbon emissions తగ్గుతాయని తెలిపారు. 365-day cover cropping ప్రాముఖ్యతను వివరించారు.
విజయవంతమైన శిక్షణకు శాస్త్రీయ అవగాహన అవసరం అని డాక్టర్ డీవీ రాయుడు, డాక్టర్ నివాసులు, డిల్లీ రావు పేర్కొన్నారు. ట్రైనర్లు శిక్షణలో ప్రతీ అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు.