
హనుమజ్జయంతిని పురస్కరించుకుని గురువారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం మరియు మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.
సాయంత్రం మూడు గంటలకు, మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణల మధ్య మేళతాళాల సాక్షిగా ప్రత్యేక పూజలు, అస్థానం వేడుకగా నిర్వహించబడింది. అనంతరం భక్తులకు ప్రసాదాల పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, ఆరోగ్య విభాగం నుంచి డాక్టర్ మధుసూదన్, మరియు ఇతరులు పాల్గొన్నారు.