
– జూన్ 1న ఉదయం 5 గంటల నుంచి పంపిణీ
ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కేటాయించే మాసాంత దర్శనలో భాగంగా, జూన్ 3న జరుగనున్న దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మొదట వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ (First-Come, First-Serve) జారీ చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటన విడుదల చేసింది.
టోకెన్లు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియం కౌంటర్లలో, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద అందించబడతాయి.
తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల నివాసితులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును తీసుకురావలసి ఉంటుంది.