March 22, 2026

కేంద్ర మంత్రిని కలిసిన చిత్తూరు ఎంపీ

చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆదివారం సందడి నెలకొంది. తవణంపల్లి మండలం, దిగువమాఘం గ్రామంలోని మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి నివాసానికి విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

సాదర స్వాగతం – ఆత్మీయ ఆలింగనం

జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన కేంద్రమంత్రికి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఘనస్వాగతం పలికారు. “వెల్కమ్ టు చిత్తూర్” అంటూ మంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉభయ నేతలు కాసేపు కుశలప్రశ్నలు వేసుకున్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన అంశాలపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం.

వీరితో పాటు కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు.
#RammohanNaidu #DaggumallaPrasadRao #ChittoorNews #Puthalapattu #GallaJayadev #APPolitics #TDPJanasenaBJP #CivilAviationMinister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *