April 13, 2026

CINEMA: చింతామణి సొంతకథ ప్రారంభం

CHINTAMANI SONTHA KATHA

CHINTAMANI SONTHA KATHA

శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘చింతామణి సొంతకథ’ ఘనంగా ప్రారంభమైంది. మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మే 8న గోదారి గట్టుపైన థియేటర్లలోకి.. ఈ వార్తను కూడా చదవండి

ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తపు షాట్‌కు క్లాప్ ఇచ్చారు. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిహెచ్‌ఎంసి రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సోషల్ యాక్టివిస్ట్ డా. శ్రీనివాస్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

దర్శకుడు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ, ఇది తన నాలుగో చిత్రమని, కమర్షియల్ పంథాలో సాగే క్రైమ్ థ్రిల్లర్ అని వెల్లడించారు. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండే డ్రామా మరియు ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు పేర్కొన్నారు.

కథలోని బలాన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించినట్లు నిర్మాతలు బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి తెలిపారు. ప్రేమ్ రాజ్ చెప్పిన కథాంశం చాలా ఆసక్తికరంగా ఉందని, అందుకే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చామని వారు స్పష్టం చేశారు. ఈ వేడుకలో నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కూడా పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

#ChinthamaniSonthaKatha #Sriram #Mahima Gupta #TeluguCinema #MovieLaunch #TollywoodUpdates #CrimeThriller

మే 8న గోదారి గట్టుపైన థియేటర్లలోకి.. ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *