వడ్లమూడి లక్ష్మమ్మకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నివాళులు
చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్ప గారి పల్లికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మీ తల్లి లక్ష్మమ్మ శనివారం ఆకస్మిక మరణం చెందారు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 90 ఏళ్ల ఆ వృద్ధురాలి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన వారిలో పార్టీ నేతలు, స్థానికులు వున్నారు.
#ChevireddyHarshithReddy #Chandragiri #YSRCP #Panapakam #TirupatiNews #Condolences #APPolitics
