April 27, 2026

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 523వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

అన్నమాచార్య కళామందిరంలో ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద…. అన్నమాచార్యుల
ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి అభిషేకం జరిగింది. అభిషేకంలో భాగంగా అన్నమయ్య విగ్రహానికి జలంతో శుద్ధి గావించి పాలు, పెరుగు, తేనె, పంచదార, టెంకాయ, నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చక వేద మంత్రోత్సవాల నడుమ అభిషేకం జరిగింది.

అనంతరం అన్నమయ్య విగ్రహానికి పట్టు వస్త్రాలు, పుష్పమాలతో అలంకరించి ధూప దీప నివేదన కర్పూర హారతి అన్నమయ్య భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు వారు నగర సంకీర్తనలో పాల్గొని గోష్టి గానం నిర్వహించారు. ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *