
అప్పలాయగుంట (Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారు గజ వాహనం (Gaja Vahanam) పై భక్తులకు అభయహస్తం (Abhayahastham) తో దర్శనమిచ్చారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి, జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) భాగంగా గురువారం రాత్రి 07.00 గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గజ వాహనం (Gaja Vahanam) పై భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 07.00 గంటలకు గజ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 08.00 గం.లకు సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో (Vahana Seva) టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.