April 10, 2026

AP CABINET: 31 భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి పచ్చ జెండా

AP CABINET

AP CABINET

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చే కీలక నిర్ణయాలకు వేదికైంది. దాదాపు రూ.39,436 కోట్ల విలువైన 31 భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, పాలనలో క్రమశిక్షణపై సీఎం మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

క్వాంటం హబ్‌గా ఏపీ నవశకం: CBN ఈ వార్తను కూడా చదవండి

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో 31 ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటమ్ వ్యాలీలో భాగంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, విద్యా సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మొత్తం 60కి పైగా ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ అజెండా అంశాలు ముందుగానే బయటకు రావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లీక్ అయితే సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, గతంలో ఎన్టీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాలను గుర్తు చేస్తూ హెచ్చరించారు. ప్రభుత్వ గోప్యతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడంపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. జోనల్ వ్యవస్థలో మార్పులు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘జలధార’, ‘సూర్య ఘర్’ వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. రెవెన్యూ మంత్రులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి పాస్‌బుక్స్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళా బిల్లుతో పాటు రాబోయే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

#AndhraPradesh #APCabinet #ChandrababuNaidu #Amaravati #IndustrialGrowth #QuantumValley #APDevelopment #InvestInAP #BreakingNews

క్వాంటం హబ్‌గా ఏపీ నవశకం: CBN ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *