
తిరుమల, జూన్2, : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 1, 2025 ఆదివారం నాటి సమాచారం ప్రకారం, మొత్తం 78,031 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం, తలనీలాలు: నిన్న ఒక్కరోజే 32,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా, శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.46 కోట్లు ఆదాయం లభించింది.
దర్శనానికి సమయం పడుతుంది: ప్రస్తుతం తిరుమలలోని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. అవుట్సైడ్ లైన్ ఎట్ ఏటీజీహెచ్ (ATGH) వరకు భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.