
ఉద్రిక్తత వాతావరణం
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ అయిన జూయిష్ మ్యూజియం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా హోం భద్రతా మంత్రి క్రిస్టీ నోయం అధికారకంగా ధ్రువీకరించారు.
“వాషింగ్టన్ డీసీలోని జూయిష్ మ్యూజియం సమీపంలో ఈ రాత్రి ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది విచక్షణ రహితంగా హత్యకు గురయ్యారని ఆమె ఎక్స్లో తెలిపారు. ఈ ఘటనపై మేము సమగ్ర విచారణ చేపట్టుతున్నామని వివరించారు.
ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి టాల్ నైమ్ కోహెన్ కథనం ప్రకారం, “క్యాపిటల్ జూయిష్ మ్యూజియంలో జరిగిన ఓ జూయిష్ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఇద్దరు సిబ్బందిని దుండగులు దగ్గర నుంచి కాల్చి చంపారని వెల్లడించారు.
ఘటనాస్థలికి DC పోలీసు అధికారులు, FBI సిబ్బంది చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి ప్రజా భద్రతకు ఏ విధమైన ముప్పు కలగలేదని FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్ పేర్కొంది. కాల్పుల సమయంలో ఇజ్రాయెల్ రాయబారి అక్కడ లేరని, ఈ ఘటనకు ఆయనకు సంబంధం లేదని ఎంబసీ ప్రతినిధి ఓ న్యూస్ చానల్కు చెప్పారు.
అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి మరియు DCకి ఆదేశికంగా ఉన్న యుఎస్ అటార్నీ జీన్ పైరో ఇద్దరూ ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అమెరికన్ జూయిష్ కమిటీ సీఈఓ టెడ్ డోయిట్చ్ మాట్లాడుతూ,ఈ దారుణమైన హింసాత్మక సంఘటనతో తాము తీవ్రంగా విషాదంలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం బాధితుల కుటుంబాలపైనే తమ దృష్టి ఉందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ UN రాయబారి డ్యానీ డాన్ స్పందిస్తూ ఇది ఒక పాశవికమైన, యూదులకు వ్యతిరేకంగా జరిగిన ఉగ్రవాద చర్య అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాషింగ్టన్ DCలోని నార్త్వెస్ట్ ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
ఈ సంఘటనకు తామే బాధ్యలమని ఏ సంస్థ ఇంత వరకూ ప్రకటించలేదు.