నేతాజీకి ‘డేవిడ్ రెడ్డి’ నివాళి: దేశభక్తితో మంచు మనోజ్ సరికొత్త పోరాటం!
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ చిత్ర బృందం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఈ చిత్రం నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఉండబోతోందని మేకర్స్ ఈ సందర్భంగా వెల్లడించారు.
నేతాజీ స్ఫూర్తితో ‘డేవిడ్ రెడ్డి’ ప్రయాణం
నేతాజీ జయంతిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను” అన్న నేతాజీ నినాదం చరిత్రనే కాదు, ఈ సినిమా ఆత్మను కూడా ప్రభావితం చేసిందని చిత్ర బృందం పేర్కొంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల పోరాట పటిమను నేటి తరానికి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని మంచు మనోజ్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
1897-1922 మధ్య సాగే పీరియాడిక్ కథ
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధుల తరహాలోనే ‘డేవిడ్ రెడ్డి’ అనే వీరుడు దేశం కోసం ఎలా పోరాడారు అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
