March 27, 2026

జనవరి 15న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి

పవిత్ర ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గోదా కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తారు. చివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది.

#TTD #Tirupati #GodhaKalyanam #Dhanurmasam #AndalAmma #LordKrishna #SpiritualEvent #SVBC #TirumalaUpdates #TeluguCulture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *