కొడంగల్లో ఓటు వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ (ZP) ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రాకతో కొడంగల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
#Telangana #MunicipalElections2026 #RevanthReddy #BhattiVikramarka #Kodangal #TelanganaPolitics #VoteNow
