అమెరికా చేతుల్లో భారత్ ఇంధన భద్రత!: రాహుల్ గాంధీ
భారతదేశ ఇంధన భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మన దేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలనేది కూడా అమెరికానే నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఇంధన స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడ్డాయని హెచ్చరించారు. 1.4 బిలియన్ల భారత ప్రజలు భవిష్యత్తులో ఇంధన వనరుల కోసం కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
డేటా ఆధిపత్యం.. డాలర్ రాజకీయం
బడ్జెట్లో కీలకమైన అంశాలకు కేటాయింపులు లేవని విమర్శిస్తూనే, డేటా భద్రతపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్ విలువ బలంగా ఉండాలంటే మన దేశానికి సంబంధించిన డేటా అమెరికాకు అవసరమని, అందుకే ఆ దిశగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో, భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో విఫలమవుతోందని విశ్లేషించారు.
రైతులకు జరిగిన అన్యాయంపై నిప్పులు
భారతీయ రైతుల పట్ల ప్రధాని మోదీ అనుసరిస్తున్న తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తన రైతుల ప్రయోజనాల కోసం భారత ఎగుమతులపై 18 శాతం సుంకాలు విధించి గౌరవించుకుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం విదేశీ దిగుమతులపై సున్నా టారిఫ్ విధించి మన రైతులను అవమానిస్తోందని విమర్శించారు. ఈ బడ్జెట్ సామాన్యుల కంటే కార్పొరేట్ శక్తులకే మేలు చేసేలా ఉందంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
#RahulGandhi #LokSabha #Budget2026 #IndianPolitics #EnergySecurity #FarmersRights #ModiGovernment
