బాధిత కుటుంబానికి నల్లపరెడ్డి ప్రసన్న పరామర్శ..
నెల్లూరు జిల్లా గుమ్మళ్ళదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యాచారానికి గురై, చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. చిన్నారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆయన, బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
#NallapareddyPrasannaKumarReddy #YSRCP #JusticeForMinor #GanjaMafia #NelloreNews #APPolitics #LawAndOrder #AndhraPradesh
