April 11, 2026

బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తాం: ప్రధాని మోడీ

NARENDRA MODI

NARENDRA MODI

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) అత్యంత వేగవంతంగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. పూర్బ బర్ధమాన్ జిల్లా కత్వాలో శనివారం జరిగిన భారీ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి ఖాయమని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

Vijayawada Terror Links : ఉగ్ర లింకుల కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ ఈ వార్తను కూడా చదవండి

గత 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ప్రధాని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆ అవినీతిపై సమగ్రమైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారి దుకాణాలను మూసివేస్తామని, దోచుకున్న సొమ్మును వెలికితీస్తామని మోడీ హెచ్చరించారు.

బిజెపి ర్యాలీలకు మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడం విజయావకాశాలను పెంచుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లోని మహిళల సంక్షేమం కోసం బిజెపి కట్టుబడి ఉందన్న ఆయన.. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ. 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని పునరుద్ఘాటించారు. భారీ ఓటింగ్ జరిగిన చోటల్లా బిజెపి-ఎన్డీయే కూటమికి భారీ మెజారిటీ లభిస్తోందని ఆయన విశ్లేషించారు.

ఇటీవలే పోలింగ్ ముగిసిన కేరళ రాజకీయాలను మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అక్కడ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ జట్లు గెలుపుపై నమ్మకం కోల్పోయాయని.. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతోందని ఎద్దేవా చేశారు. టీఎంసీ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, బిజెపి విజయం దిశగా దూసుకుపోతోందని మోడీ క్యాడర్‌లో ఉత్సాహం నింపారు.

#NarendraModi #WestBengalElections #CAA #BJP #TMC #PoliticalNews #BengalPolls #Election2026 #ModiInBengal

Vijayawada Terror Links : ఉగ్ర లింకుల కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *