March 27, 2026

మిథున్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా?

అమరావతి మద్యం స్కాం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక విచారణ జరుపుతోంది. సిట్ దాఖలు చేసిన కౌంటర్లో మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు, ఆయన పాత్రపై ఆధారాలు, కస్టడీ కోరుతూ లోతైన దర్యాప్తు ఆవశ్యకతను నొక్కిచెప్పింది.

అమరావతి, జూన్ 12: అమరావతిలో మద్యం స్కాం (Liquor scam) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ (Anticipatory bail) పిటిషన్పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను తిరస్కరించాలని కోరుతూ, ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం.

సిట్ తన కౌంటర్లో వెల్లడించిన ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, గతంలో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే తిరస్కరించిందని అలాగే దాని అనంతరం దర్యాప్తు (Investigation) లో స్పష్టత ఏర్పడిందని పేర్కొన్నారు. వీటితోపాటు మద్యం అక్రమ కార్యకలాపాల్లో వ్యూహ రచన (Strategy) అమలు మిథున్ రెడ్డిదే అని, ఎంపీ పదవిని దుర్వినియోగం (Misuse) చేశారని, వేర్వేరు మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు రూ.5 కోట్ల మేర నిధులు (Funds) చేరాయని సిట్ తన కౌంటర్లో తెలిపింది.

వీటిని చూపుతూ మద్యం కేసులో మరింత లోతైన విచారణ (Inquiry) చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. దర్యాప్తు మరింత ముందుకు సాగించేందుకు ఆయనను కస్టోడియల్ విచారణకు అనుమతించాలని కోరింది. ఇప్పటికే ఒకసారి బెయిల్ నిరాకరించబడిన నేపథ్యంలో, తాజా పిటిషన్పై హైకోర్టు తీసుకునే నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందా? లేక విచారణ కోసం అరెస్ట్కు అనుమతిస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *