‘42% బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి’
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు గురువారం బీసీ భవన్లో ఆయన వివరాలు వెల్లడించారు. (BC Reservations 42 Percent)
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. (MPTC ZPTC Elections)
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలా చేయకుండా ఎన్నికలకు వెళితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని, లేదంటే బీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
#RKrishnaiah
#RevanthReddy
#BCReservations
#MPTCElections
#ZPTCElections

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
