March 24, 2026

బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం: మదనపల్లి డీఎస్పీ మహేంద్ర

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.. బాధితులతో నేరుగా మాట్లాడిన డీఎస్పీ.

పోలీస్ గ్రీవెన్స్ నిర్వహణ

అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి డీఎస్పీ యస్. మహేంద్ర ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, బాధితులకు తక్షణ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులతో డీఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సివిల్ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీలను పరిశీలించిన అనంతరం, డీఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి, చట్ట పరిధిలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం ఉపేక్షించకుండా, నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని పోలీస్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించినా లేదా బాధితులను ఇబ్బందులకు గురిచేసినా శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుదారునికి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ కార్యాలయ సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

#Madanapalle #AnnamayyaDistrict #PoliceGrievance #DSPMahendra #LawAndOrder #PublicService #PoliceNews #Justice #APPolice #Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *