పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి, తన ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన జగ్గయ్యపేట పట్టణంలో కలకలం రేపింది.
జగ్గయ్యపేట పట్టణంలోని కాకాని నగర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన యువతి, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్తో నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల పాటు కలిసి చదువుకున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడిందని ఆమె పేర్కొంది. తర్వాత కడపలో ఉద్యోగం చేస్తున్న తనను హైదరాబాద్కు రావాలని చెప్పి, అక్కడ కలిసి ఉండాలని కోరినట్లు ఆరోపించింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబర్చుకున్నాడని, పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసేవాడని యువతి వాపోయింది. ఈ విషయమై 2023లో హైదరాబాద్లో ఫిర్యాదు చేయడంతో, బాలు సత్యదేవ్ తల్లిదండ్రులు వచ్చి పెళ్లి జరిపిస్తామని అంగీకరించి, చిలుకూరు బాలాజీ దేవాలయానికి తీసుకెళ్లారని తెలిపింది. అయితే పెళ్లి జరగబోయే సమయంలో బాలు సత్యదేవ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడని పేర్కొంది.
అప్పటి నుంచి తనను కలవనీయకుండా అతడి తల్లిదండ్రులు అడ్డుకుంటూ (Love affair), రహస్యంగా ఉంచుతున్నారని, తనను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని (Cheating case) యువతి ఆరోపించింది. తన ప్రేమికుడిని తీసుకొచ్చి తనకు అప్పగించాలని (Marriage promise) డిమాండ్ చేస్తూ అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
సమాచారం అందుకున్న జగ్గయ్యపేట ఏఎస్సై రాణి ఘటనా స్థలానికి చేరుకుని యువతికి నచ్చచెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. యువతి తల్లిదండ్రులను బెంగళూరు నుంచి పిలిపిస్తున్నట్లు తెలిపారు. బాలు సత్యదేవ్ తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్సై–2 శంకర్నాయక్ మాట్లాడుతూ, ఇరు పక్షాలను పిలిపించి మాట్లాడిన అనంతరం (Police inquiry), ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పారు.
#LoveCheating
#Jaggayyapeta
#CrimeNews
#MarriageFraud
#PoliceInquiry
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.