March 27, 2026

INDW vs SLW 3వ టి20 : సిరీస్‌ ఇక్కడే సాధించాలి

శ్రీలంక మహిళలతో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి రెండు టి20ల్లో ఘన విజయాలు సాధించిన భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌, మూడో టి20లో గెలిస్తే (INDW vs SLW 3rd T20I) సిరీస్‌ను ఖాయం చేసుకోనుంది.

రెండో టి20లో శ్రీలంక బ్యాటర్లు ఆరంభంలో మెరుగ్గా ఆడినప్పటికీ, భారత స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ అద్భుతంగా బౌలింగ్‌ చేసి లంక బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. భారీ స్కోర్‌ దిశగా వెళ్తున్న శ్రీలంకను కేవలం 128 పరుగులకే పరిమితం చేయడంలో భారత్‌ సఫలమైంది.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత భారత మహిళల జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. శ్రీలంకతో జరిగిన తొలి రెండు టి20ల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ సమిష్టిగా రాణించింది. దీంతో ప్రత్యర్థి జట్టును రెండు మ్యాచ్‌ల్లోనూ 130 పరుగుల్లోపే నిలువరించగలిగింది. (India Women vs Sri Lanka Women) టి20ల్లో శ్రీలంకపై భారత్‌ వరుసగా తొమ్మిదో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 జులై నుంచి లంకపై భారత్‌కు ఓటమి ఎదురుకాలేదు.

బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించగా, షెఫాలీ వర్మ రెండో టి20లో అర్ధసెంచరీతో ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చింది. బౌలింగ్‌ విభాగంలో తొలి మ్యాచ్‌లో 6 వికెట్లు, రెండో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టి లంకను దెబ్బతీశారు. శ్రీచరణి, వైష్ణవి శర్మతో పాటు క్రాంతి గాడ్‌ కీలక పాత్ర పోషించారు. (Women T20 Series)

#INDWvsSLW
#WomenCricket
#T20Series
#TeamIndiaWomen
#CricketNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *