April 9, 2026

అతిపెద్ద DATA CENTRE.. శంకుస్థాపన ఎప్పుడంటే?

GOOGLE

GOOGLE

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రతిష్టాత్మక డేటా సెంటర్ నిర్మాణానికి విశాఖపట్నంలో ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంతో ఏపీ అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా వెలుపల గూగుల్ చేపడుతున్న అతిపెద్ద పెట్టుబడి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

గూగుల్ సంస్థ దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.35 లక్షల కోట్లు) భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా ఇది రూపుదిద్దుకోనుంది. 2028 చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి, కార్యకలాపాలను ప్రారంభించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

తెల్ల పులికి ‘పసుపు’ పులుల జననం! ఈ వార్తను కూడా చదవండి

ఈ మెగా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో మొత్తం 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఆనందపురం తర్లువాడ, అడవివరం మరియు రాంబిల్లి ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్‌ఫ్రా భాగస్వామ్యంతో ఈ నిర్మాణ పనులను చేపట్టబోతున్నారు.

విశాఖ తీర ప్రాంతం కావడంతో సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ద్వారా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల విశాఖపట్నం అంతర్జాతీయ డేటా కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా (డేటా సెంటర్ క్లస్టర్) గుర్తింపు పొందుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ మరియు గూగుల్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

#GoogleDataCenter #AndhraPradesh #Visakhapatnam #ITInvestment #ChandrababuNaidu #NaraLokesh #DigitalIndia #VizagTech #TechNewsTelugu

తెల్ల పులికి ‘పసుపు’ పులుల జననం! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *