- వాహనసేవల శోభ, కళ్యాణోత్సవ వేడుకలు
- ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం – మానసిక శాంతికి మహత్మ్యం
భక్తి సంద్రంలో మునిగే another divine destination — తిరుపతికి సమీపంలో ఉన్న అప్పలాయగుంట ఈసారి భక్తుల తలుపులు తట్టనుంది. వేల సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు విశిష్టంగా, వైభవంగా జరగనున్నాయి. ఉదయాన్నే వేదఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోనుంది. రాత్రికి రాత్రి స్వామివారి వాహనసేవలు భక్తులను ఆధ్యాత్మికానందంలో తేలిపోనివేస్తాయి.
వాహనసేవల విశేషాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 6న అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి. వాహనసేవలు ఉదయం 8 నుండి 9, రాత్రి 7 నుండి 8 వరకు జరుగుతాయి. ముఖ్యమైన తేదీలు ఈ విధంగా ఉన్నాయి:
-
జూన్ 7: ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
-
జూన్ 8: చిన్నశేష వాహనం, హంస వాహనం
-
జూన్ 9: సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
-
జూన్ 10: కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
-
జూన్ 11: మోహినీ అవతారం, గరుడ వాహనం
-
జూన్ 12: హనుమంత వాహనం, గజ వాహనం
-
జూన్ 13: సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
-
జూన్ 14: రథోత్సవం, అశ్వ వాహనం
-
జూన్ 15: చక్రస్నానం, ధ్వజావరోహణం
జూన్ 10న సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు కల్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రూ.500 చెల్లించి గృహస్తులు ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. వారికి ఉత్తరీయం, రవికె, లడ్డు, అప్పం బహుమానంగా అందజేస్తారు.
ఆలయ ప్రాశస్త్యం మరియు చారిత్రక నేపథ్యం
శతాబ్దాల చరిత్రను కలిగిన అప్పలాయగుంట ఆలయం కార్వేటినగర రాజుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. శాసనాధారాల ప్రకారం, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయాల వలే ఇక్కడ కూడా రాజులు ఉత్సవాల్లో కీలకపాత్ర పోషించేవారు. ఆలయ గర్భాలయంలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి చతుర్బుజ రూపంలో శంఖుచక్రాలతో, అభయ హస్తంతో దర్శనమిస్తారు.
గర్భాలయానికి సమీపంలో పద్మావతి అమ్మవారి ఆలయం, గోదాలక్ష్మీ దేవి ఆలయాలు ఉన్నాయ. ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది.
తిరుమల దేవస్థానానికి వెళుతూ వకుళాదేవి ఆశ్రమం చేరే మార్గంలో స్వామివారు సిద్ధేశ్వరస్వామి తపస్సును మెచ్చి అక్కడే ప్రసన్నంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం చెబుతోంది.
భక్తి–సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భజనలు, కోలాటాలు, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.