అనంతపురంలో ‘జనసేన’ జోరు: మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో జనసైనికుల భారీ ర్యాలీ!
ముఖ్య అతిథులుగా హాజరైన అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే ప్రసాద్.
ర్యాలీతో దద్దరిల్లిన అనంతపురం
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం అత్యంత అట్టహాసంగా జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అహుడా (AHUDA) చైర్మన్ టి.సి.వరుణ్ పిలుపు మేరకు జనసైనికులు నీలపు జెండాలతో భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ ఫ్లైఓవర్ నుండి మార్కెట్ యార్డ్ వరకు వందలాది బైకులు, ఆటోలతో నిర్వహించిన ర్యాలీ నగరవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “జై జనసేన.. జై పవన్ కళ్యాణ్”, “టి.సి.వరుణ్ నాయకత్వం వర్ధిల్లాలి” అనే నినాదాలతో మార్గం పొడవునా హోరెత్తింది.
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
మార్కెట్ యార్డ్ నూతన చైర్పర్సన్గా బల్ల పల్లవి, వైస్ చైర్మన్గా అర్షదుల్లా, పాలకమండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నూతన కార్యవర్గానికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రైతు సేవలో కూటమి ప్రభుత్వం
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతి రైతుకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. క్రయవిక్రయాల్లో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా పాలకమండలి కృషి చేయాలన్నారు. జనసేన పార్టీ తరఫున డైరెక్టర్లుగా నియమితులైన అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Anantapur #MarketYard #Janasena #TCVarun #AmbikaLakshminarayana #DaggupatiPrasad #PawanKalyan #APCoalitionGovt #FarmerService #AnantapurPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
