March 16, 2026

ఆంధ్రుల ఆత్మగౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

NARA LOKESH

NARA LOKESH

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలనే ధారపోసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా రాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ statue of sacrifice కొలువుదీరింది. అమరజీవి 125వ జయంతిని పురస్కరించుకుని, ఆయన చేసిన 58 రోజుల సుదీర్ఘ దీక్షకు గుర్తుగా నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ పాల్గొని ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో ఆరు నెలల్లోనే ఈ స్మృతివనం పనులను పూర్తి చేయడం విశేషం.

విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ Nara lokesh మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అనే రూపంలో అమరజీవి నిరంతరం జీవించే ఉంటారని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని చూడగానే ఆయన చేసిన మహోన్నత త్యాగం ప్రతి ఒక్కరికీ గుర్తుకురావాలనే ఉద్దేశంతోనే దీనికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. “నేను తెలుగువాడిని, ఆంధ్రుడిని అని గర్వంగా చెప్పుకునే గౌరవాన్ని మనకు ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారే” అని లోకేష్ భావోద్వేగంగా చెప్పారు.

పొట్టి శ్రీరాములు Pottisreeramulu కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసమే కాకుండా, సమాజంలోని అసమానతలపై కూడా పోరాడిన గొప్ప యోధుడని మంత్రి కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, నెల్లూరులో దళితుల ఆలయ ప్రవేశం కోసం, అంటరానితనంపై రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. పదవులను ఆశించకుండా తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన నిస్వార్థ నాయకుడు ఆయనని లోకేష్ ప్రశంసించారు.

అమరావతిలో దేశంలోనే తొలి ‘ఏఐ’ క్యాంపస్: మంత్రి లోకేష్ ఈ వార్తను కూడా చదవండి

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కొణిజేటి రోశయ్యను మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన ఒక పరిపూర్ణమైన ‘స్టేట్స్ మ్యాన్’ అని, అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎంతో శ్రద్ధగా వినేవారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తాము నిరంతరం టచ్‌లో ఉండేవారమని, రాజకీయాలకు అతీతంగా ఆయన సలహాలు తీసుకునేవాడినని లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఆర్యవైశ్య ప్రముఖులు మరియు పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

StatueOfSacrifice #PottiSriramulu #Amaravati #AndhraPradesh #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TeluguPride #Sacrifice

అమరావతిలో దేశంలోనే తొలి ‘ఏఐ’ క్యాంపస్: మంత్రి లోకేష్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *