జగన్ను కలిసిన చెవిరెడ్డి: 226 రోజుల జైలు వాసం తర్వాత భావోద్వేగ భేటీ
మద్యం అక్రమాల కేసులో సుమారు 226 రోజుల పాటు రిమాండ్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గురువారం సాయంత్రం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన మరుసటి రోజే (శుక్రవారం, జనవరి 30, 2026) ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి వెళ్లారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇద్దరు కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే), చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో కలిసి జగన్ను కలిశారు. రాజకీయ కక్షలతో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలుకు వెళ్లినా వెనకడుగు వేయకుండా నిలబడిన చెవిరెడ్డి ధైర్యాన్ని జగన్ కొనియాడారు. తండ్రి 226 రోజులుగా జైలులో ఉన్నప్పటికీ, అధైర్యపడకుండా పార్టీ కోసం పోరాడిన మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను జగన్ ప్రత్యేకంగా అభినందించారు. “మీ పోరాటం వృధా పోదు, మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి” అని జగన్ వారిని ఓదార్చుతూ ధైర్యం చెప్పారు.
చెవిరెడ్డి మాటల్లో..
నమ్మిన సిద్ధాంతం కోసం, తన నాయకుడు జగన్ కోసం ఎంతటి కష్టానికైనా, పోరాటానికైనా తాను సిద్ధమని చెవిరెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ నిర్బంధం తన నైతిక బలాన్ని తగ్గించలేదని ఆయన పేర్కొన్నారు.
#ChevireddyBhaskar Reddy #YSJagan #YSRCP #AndhraPradeshPolitics #Tadepalli #BreakingNewsTelugu #PoliticalRevenge

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
