
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04.00 – 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 – 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 8 గం.లకు పల్లకీలో మోహినీ అవతారంలో స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.