
తిరుపతి, జూన్ 08 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఆదివారం రాత్రి 7.30 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్న కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఈ వాహనసేవ (Vahana Seva) కోలాహలంగా జరిగింది. ఔషధాలకు అధిపతి అయిన చంద్రుడు (Moon God) పోషకుడిగా, రసస్వరూపుడిగా ఔషధులను పోషిస్తాడు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతాయి. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆహ్లాదపరుస్తారు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏవో (F&CAO) శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో (Deputy EO) శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు (Priests), ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు (Sevakulu), భక్తులు (Devotees) పాల్గొన్నారు.
జూన్ 09న రథోత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 6.15 గంటల నుండి స్వామివారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు..