
తిరుపతి, జూన్ 08 : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న మొత్తం 88,257 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తలనీలాలు (Tonsures) సమర్పించిన భక్తుల సంఖ్య 45,068గా నమోదైంది. శ్రీవారి హుండీకి (Hundi) ₹3.68 కోట్లు కానుకలుగా వచ్చాయి.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపా్ర్ట్మెంట్లు (Compartments) పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం (Silathoranam) వెలుపల వరకు ఉంది. సర్వదర్శనం (Sarvadarshanam) కోసం ఎదురుచూసే భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు.