

మచిలీపట్నం, జూన్ 4: మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద జరుగనున్న నాలుగు రోజుల “మసులా బీచ్ ఫెస్ట్ – 2025” కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నుండి ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్లో నేషనల్ లెవల్ Water Sports, Adventure Sports, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. పర్యాటక శాఖ, APTDC, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.
ఫెస్ట్ హైలైట్స్
ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో 60 అడుగుల ఎత్తు అమరావతి అసెంబ్లీ నమూనా గేట్ వే ఆఫ్ అమరావతి ఐకాన్ను ఆవిష్కరిస్తారు. అలాగే 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేస్తూ వాటర్ స్పోర్ట్స్ పోటీలు ప్రారంభించనున్నారు.
ఫెస్ట్లో భాగంగా Jet Ski, Para Gliding, Heliride, Bungee Jumping, Speed Boats వంటి అడ్వెంచర్ ఈవెంట్లు ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్లు, తెలుగు సినిమా సెలబ్రిటీలతో స్టేజ్ షోలు కూడా ఆకర్షణగా నిలవనున్నాయి. District SP పర్యవేక్షణలో వన్ వే ట్రాఫిక్ నిర్వహణ, Marine officers సహకారంతో సముద్ర స్నానాల పట్ల పర్యాటకులకు సురక్షిత వాతావరణం కల్పించారు.
బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్:
ఈ వేడుకలో 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ జరుగనుంది. 24 రాష్ట్రాల నుండి పురుషుల జట్లు, 21 రాష్ట్రాల నుండి మహిళా జట్లు పాల్గొంటుండగా, లీగ్-కమ్-నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగనున్నాయి. మొత్తం 600 మంది ప్లేయర్లు పోటీలకు హాజరవుతారు.
సీ కయాకింగ్ – తొలిసారి ఏపీలో
మచిలీపట్నంలోనే రాష్ట్రంలో తొలిసారి 3వ నేషనల్ సీ కయాకింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. 16 రాష్ట్రాల నుండి జాతీయ-అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
బీచ్ వాలీబాల్ పోటీలు:
ఫెస్టివల్లో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. 8 పురుషుల, 4 మహిళల జట్లు లీగ్-కమ్-నాకౌట్ పద్ధతిలో పోటీపడతాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం జిల్లాల నుండి జట్లు పాల్గొంటున్నాయి.
కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఏర్పాట్లు
ఫెస్టివల్ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రీ కొల్లు రవీంద్ర నేతృత్వంలో అధికారులు నెల రోజులుగా శ్రమించారు. భద్రత, వసతి, ట్రాఫిక్, ఫుడ్ కోర్టులు, స్టాల్స్ వంటి అంశాలన్నింటినీ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు live telecast చేయనున్నారు.
ఈవెంట్ ద్వారా మచిలీపట్నం పర్యాటకానికి కొత్త ఊపు లభించనుంది.