April 5, 2026

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఈటల

ETELA RAJENDAR

ETELA RAJENDAR

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులువు కాదని, బీజేపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌లోకి వెళ్లి ఉంటే మంత్రి లేదా డిప్యూటీ సీఎం అయ్యేవాడినని, కానీ తాను పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని ఈటల పేర్కొన్నారు. తమ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల పక్షాన పోరాడుతానని ఆయన పునరుద్ఘాటించారు.

ఐదేళ్ల క్రితం కేసీఆర్ తనను బీఆర్ఎస్ నుంచి అన్యాయంగా బయటకు పంపడమే కాకుండా, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఈటల ఆరోపించారు. తన కోళ్ల ఫారాలను కూల్చివేసి, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. తనను గెంటేశాక ఇన్ని కష్టాలు పెట్టిన పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, తెలంగాణ సమాజానికి తన నిబద్ధత ఏంటో తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో విద్యార్థుల నుంచే కాలేజీ ఫీజులు.. హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు ఈ వార్తను కూడా చదవండి

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈటల విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధపు పునాదుల మీద పాలన సాగిస్తున్నారని, గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మీడియాను మేనేజ్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, త్వరలోనే క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంత్రి పదవి ఆఫర్ చేసినా ఉద్యమ సెంట్రిక్ పాలిటిక్స్ కోసం తిరస్కరించానని ఈటల గుర్తు చేసుకున్నారు. పదవుల కోసం పాకులాడకుండా ధర్మాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని తెలిపారు. హుజూరాబాద్ ప్రజలు కోరితే అక్కడ డంపింగ్ యార్డ్ సమస్యపై పోరాటానికి సిద్ధమని, తన పార్లమెంట్ పరిధిలోని సమస్యలపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశానని వెల్లడించారు.

#EtalaRajender #TelanganaPolitics #BJP #MalkajgiriMP #TelanganaNews #EtalaSpeaks #BJPTS #HyderabadPolitics

తెలంగాణలో విద్యార్థుల నుంచే కాలేజీ ఫీజులు.. హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *