- ఎన్.టి. ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.
- పార్టీ పేరును తెలుగు దేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకుంటే మంచిది.
- ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి,
టిడిపి కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్త వ్యస్తం అయిందని,బ్రష్టుపట్టిందని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి విచారం వెలిబుచ్చారు.శనివారం రాయచోటి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలని మూడు రకాల పాటశాలలుండేవని,అందరికీ సౌకర్యంగా,సౌలభ్యంగా వుండేవని అన్నారు.
వైకా పాలనలో శాటలైట్ ఫౌండేషన్,ఫౌండేషన్,ఫౌండేషన్+,ప్రి హై స్కూల్, హై స్కూల్, హై స్కూల్+ అని ఆరు రకాల స్కూల్లు పెట్టి అయోమయం చేయడం జరిగింది. కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక వూడిపోయింది అన్నట్లు టిడిపి కూటమి ప్రభుత్వం పాటశాలవిద్యను 9 రకాలుగా విభజించి చీలికలు పేలికలుగా చేసింది.
హై స్కూళ్ళలో ఉపాధ్యాయ,విద్యార్థుల నిస్ఫత్తిని 1:40 బదులు 1:53 చేసిన ఫలితంగా 6,428 మంది ఉపాధ్యాయులు మిగులుగా తేలినారు.ఈ నేపథ్యంలో 16347 ఉపాధ్యాయ పోస్టుల మెగా డీఎస్సీ ప్రశ్నార్థకమయింది.
పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవో 85ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టిడిపి కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా జీవో 85 ను రద్దు చేయకపోగా మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఆ విధంగా టిడిపి కూటమి మాట తప్పింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రిక తప్పిదం.దీనివలన ఎన్ టి ఆర్ ఆత్మ క్షోభిస్తుంది. తెలుగు దేశం పార్టీ పేరును ఇంగ్లీష్ దేశం అని మార్చుకుంటే సరిపోతుంది అని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ డిమాండ్లు
1.ప్రాథమిక పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి.
2.తెలుగు మాధ్యమం లో చదివిన వారికి ఉన్నత విద్య ప్రవేశాలలో,ఉద్యోగాలలో 3 శాతం అదనపు మార్కులు కలపాలి.
3.కాంగ్రెస్ పాలనలో వున్నట్లే పాఠశాల విద్యలో 3 రకాల పాఠశాలలు మాత్రమే ఉండాలి.
4.ఉన్నత విద్య లో ఉపాధ్యాయుల,విద్యార్థుల నిష్పత్తి 1:40 గా వుండాలి.
5.మెగా డీఎస్సీ ని యధాతధంగా నిర్వహించి పాఠశాలలు తెరిచే లోప్ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి.
మీడియా సమావేశంలోఏపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లా బకష్,SMd గౌస్,దర్బార్,చెన్న కృష్ణ,మన్సూర్,సయ్యద్ అలీ,రఫీ,ఖాదర్,బాబా సర్దార్,ఇమ్రాంబ్ఖాన్,షబ్బీర్,ఖాదర్ ఖాన్,ఇంతియాజ్ అలీ,తదితరులు పాల్గొన్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.