April 1, 2026

రాజధానిపై చట్టాన్ని మళ్లీ మార్చవచ్చు: జగన్

EX CM YS JAGAN

EX CM YS JAGAN

ఏపీ రాజధాని అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకసారి చేసిన చట్టాన్ని పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీలో మళ్లీ మార్చవచ్చని, ఏదీ శాశ్వతం కాదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి నిర్మాణం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని జగన్ ఆరోపించారు. రాజధాని పేరుతో జరుగుతున్న ఖర్చులు, భూముల వ్యవహారం ఒక వ్యవస్థీకృత అవినీతిగా మారిందని ఆయన విమర్శించారు. లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే దాదాపు రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ వ్యయం రాష్ట్ర ఆర్థిక స్థితికి భారమని అంచనా వేశారు.

AROGYA SRI: ఆపితే ఉద్యమం తప్పదు ఈ వార్తను కూడా చదవండి

అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్ ‘మావీగన్’ (MAVIGUN) అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలిపి ఒక విస్తృత రాజధాని జోన్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. మచిలీపట్నం పోర్టును ఆధారంగా చేసుకుని ఈ 110 కిలోమీటర్ల పరిధిని చెన్నై, ముంబై తరహాలో పోర్ట్ సిటీగా మార్చవచ్చని తెలిపారు.

అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం నిధులతోనే ఈ మూడు నగరాలను అనుసంధానిస్తూ మెట్రో ప్రాంతంలా అభివృద్ధి చేయవచ్చని జగన్ వివరించారు. జాతీయ రహదారి వెంబడి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేవలం ఒకే ప్రాంతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.

#YSJagan #APCapital #Mavigun #Amaravati #AndhraPolitics #Vijayawada #Guntur #Machilipatnam #BreakingNews

AROGYA SRI: ఆపితే ఉద్యమం తప్పదు ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *