March 30, 2026

ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

కన్నడ సంగీత పితామహుడు, కర్ణాటక సంగీతానికి ఆద్యుడైన శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన ఈ వేడుకల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాదిగా భజన మండళ్ల సభ్యులు తరలివచ్చారు. పురందరదాసుల జీవితం, వారి సాహిత్య విశిష్టతను కొనియాడుతూ జరిగిన ఈ ముగింపు వేడుకలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి.

తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, మాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారు. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మహాత్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

అదేవిధంగా శ్రీ‌ తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుల వారికే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

#Tirumala #PurandaraDasa #TTD #DasaSahitya #CarnaticMusic #SpiritualAndhra #BhajanMandals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *