చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పారు స్వామీ..! జగన్
బుధవారం తాడేపల్లెలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. దాని అంశాలు ఇలా ఉన్నాయి.
రిపోర్టర్ : సార్.. చంద్రబాబు ఉపప్రధాని కాబోతున్నారట.
జగన్ : ఆహా…చంద్రబాబు నాయుడు ఉప ప్రధానా?
రిపోర్టర్ : అవును సార్ ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్ళతారట.
జగన్ : ఆయన ఉప ప్రధాని అవుతున్నారని ఎవరు చెప్పారు స్వామీ…
రిపోర్టర్ : పత్రికలలో వచ్చింది సార్…
జగన్ : ఓహో వాళ్ల మీడియా రాసుకుందా? ఓకే. ఓకే…
రిపోర్టర్ : అవును సార్…
జగన్ : ఆయనను ఇక్కడ జనమే భరించలేకపోతున్నారు… ఇక దేశ ప్రజలెక్కడ భరిస్తారు స్వామీ… అని వ్యంగ్యంగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు.
ప్రెస్ మీట్లో నవ్వులు

