
ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధాలుగా మారుతున్నాయి. ఆ రెండు దేశాలు ఇండియాకు ఇరుగు దేశాలేమి కాదు, పొరుగుదేశాలేమి కాదు. భారతదేశం ఆందోళన చెందుతోంది. అలాగే ప్రపంచం కూడా భయపడుతోంది. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతోంది. తక్షణ భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి? ఈ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం అంతటి ప్రభావాన్ని చూపుతుందా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. ఈ ఆందోళనలకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కేంద్రం కానున్నది. ఇది ప్రపంచ సముద్రయాన చమురులో మూడింట ఒక వంతు ప్రయాణించే కీలకమైన జలమార్గం.
ఇజ్రాయెల్ (Israel) మరియు ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు (Tensions) మళ్ళీ పెరుగుతున్నాయి. ఈసారి, పరిస్థితి పశ్చిమ ఆసియాకే (West Asia) కాకుండా, భారతదేశం (India) వంటి దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ ఆందోళనల మధ్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) ఉంది.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్: ఒక గ్లోబల్ చోక్పాయింట్
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం, ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సమస్య తలెత్తితే, చమురు ధరలు (Oil prices) ఆకాశాన్నంటుతాయి, సరఫరాలు (Supply chains) నిలిచిపోతాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధనంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలోని ఓపెక్ (Organization of the Petroleum Exporting Countries) సభ్య దేశాలైన సౌదీ అరెబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్ దేశాల నుంచి ప్రధానంగా ఆసియా దేశాలకు ఇక్కడ నుంచి చమురు సరఫరా అవుతుంది. సరాసరిన రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ళ చమురు ఈ మార్గం గుండా సప్లయ్ అవుతుంది. అంటే ప్రపంచంలో 5వ వంతు దేశాల ఆయిల్ సరఫరాకు ఇదే ప్రధాన మార్గం. మరి ఇక్కడే ఉద్రిక్తతలు పెరిగితే, ఈ సభ్యదేశమే యుద్ధంలో నిమగ్నమైతే, ప్రభావం ఎంతలా ఉంటుందోప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే అటు ఆర్థికవేత్తలు, ఇటు పరిశోధకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆర్థిక శాస్త్ర జూలియస్ బేర్ (Julius Baer), నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ అధిపతి నార్బర్ట్ రూకర్ (Norbert Rucker) ప్రకారం, “భౌగోళిక రాజకీయం తిరిగి మొదలయ్యింది. ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడులు ఈ ప్రాంతంలో విస్తృతమైన ఉద్రిక్తతలకు దారితీస్తాయనే భయాలను పెంచుతున్నాయి. అలాంటి సంఘర్షణలకు చమురు ఎల్లప్పుడూ ఒక కొలమానమేనంటున్నారు. వాటి ధరలు తదనుగుణంగా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పరిస్థితి అస్థిరంగా ఉంది, రాబోయే రోజుల్లోనో, వారాల్లోనో ఉద్రిక్తతలు ఎంత దూరం వెళ్తాయో తెలిసిపోతుంది.
భారతదేశానికెందుకంత ఆందోళన?
ప్రత్యేకంగా భారతదేశం ఈ ముప్పుకు గురవక తప్పదు. ఈ దేశానికి చమురు దిగుమతులలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువ, ద్రవీకృత సహజ వాయువు (LNG) దిగుమతులలో దాదాపు సగం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి మార్గం మూసివేత లేదా అంతరాయం ఏర్పడితే, భారతదేశం ప్రత్యామ్నాయ వనరులు, మార్గాలను వెతకవలసి వస్తుంది, అదే దేశం యొక్క ఆందోళన. పైగా సాధారణంకంటే అధిక ఖర్చులు, లాజిస్టికల్ సవాళ్లు ఉంటాయి.
పెరిగిన ఖర్చులు మరియు సరఫరా గొలుసు అంతరాయాల సంభావ్యత భారతదేశం అటువంటి ప్రమాదాలను తగ్గించడానికి విభిన్న ఇంధన వనరులను అన్వేషించాల్సిన అవసరాన్ని మరియు వ్యూహాత్మక నిల్వలను (Strategic reserves) పెంచుకోవాల్సిన అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. లేకపోతే ఇందన కొరతను ఎదుర్కోక తప్పదు.
చమురు ధరలు, ద్రవ్యోల్బణ ప్రమాదాలు
సంఘర్షణ తీవ్రమైతే చమురు ధరలు ఆమాతం పెరగవ్చు. బ్యారెల్కు $120కి పెరగవచ్చని జేపీమోర్గాన్ (JPMorgan) హెచ్చరించింది, చమురు ధర పెరిగిందంటే ద్రవ్యోల్బణాన్ని (Inflation) పెంచుతుంది.భారతదేశ ప్రస్తుత లోటును (Current account deficit) మరింత పెంచుతుంది.
ఇక్కడ అంతరాయం ఏర్పడితే, సరఫరా చేసే నౌకల మార్గాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇది సహజంగా అధిక ముడి చమురు ధరలను షిప్పింగ్ సంస్థలకు కార్యకలాపాల ఖర్చులను పెంచుతాయి, ఎందుకంటే నౌకలను ప్రత్యామ్నా మార్గాలలో దూర ప్రాంతాలను చుట్టి రావాల్సి వస్తుంది. ఇది సరుకు రవాణా ఛార్జీలను మరియు డెలివరీ సమయాలను పెంచుతుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది.
“చమురు సరఫరా ఆందోళనలు, వాస్తవానికి, పెరుగుతున్నాయి, చమురు వ్యాపారంలో కీలకమైన అడ్డుకట్ట అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత ప్రమాదాన్ని కలుగజేస్తుంది.” అని నార్బర్ట్ రూకర్ పేర్కొన్నారు.
గృహాలు-పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
చమురు ధరలలో పెరుగుదల అనేది అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతుంది. భారతీయ గృహాలు,వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంధన ఖర్చులు పెరగడం వినియోగదారుల బడ్జెట్లపై ప్రభావాన్ని చూపుతుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది, ఖర్చులను దెబ్బతీస్తుంది.
అదనంగా, ముడిసరుకుగా చమురుపై ఆధారపడిన పరిశ్రమలు పెరిగిన ఉత్పత్తి ఖర్చులను ఎదుర్కోవచ్చు, ఇది వాటి పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత అంటే సంఘర్షణ, ప్రభావిత జలాల్లో ప్రయాణించే షిప్పింగ్ నౌకలకు బీమా ప్రీమియంలు కూడా పెంచుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య ఖర్చులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
నిజానికి, ఈ సంఘర్షణ యొక్క విస్తృత పరిణామాలు ప్రపంచ వాణిజ్యం యొక్క అనుసంధానాన్ని, ఆర్థిక వృద్ధి, భద్రతను నిలబెట్టడంలో ప్రాంతీయ శాంతి యొక్క కీలక పాత్రను హైలైట్ చేస్తాయి. అంతేకాకుండా, భారతదేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నిరంతర ఇంధన సరఫరాను సురక్షితంగా ఉండాలంటే పశ్చిమ ఆసియాలో స్థిరత్వం చాలా అవసరం.