March 11, 2026

వివాహేతర సంబంధం కోసమే భర్త హత్య: గుంటూరు ఎస్పీ సంచలన నిజాలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త నిద్రలో గుండెపోటుతో చనిపోయాడని నమ్మబలికిన భార్యే, తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

గుండెపోటు కాదు.. పక్కా ప్లాన్‌తో హత్య

జనవరి 19న శివనాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని భార్య లోకం లక్ష్మీ మాధురి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే, మృతుడి చెవి నుండి రక్తం కారడం గమనించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో మృతుడి పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

నిద్రమాత్రలు ఇచ్చి.. ఊపిరాడకుండా చేసి..

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలోని ఒక సినిమా హాల్లో పనిచేసే మాధురికి, అక్కడే పనిచేసే కొండేటి గోపితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి శివనాగరాజును అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. గోపి సూచన మేరకు మాధురి భర్త తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది.  గొంతు నులిమి, ఊపిరి ఆడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ ఒత్తిడి వల్లే పక్కటెముకలు విరిగిపోయాయి.

ముగ్గురు నిందితుల అరెస్ట్

ఈ కేసులో పక్కా ఆధారాలతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మృతుడి భార్య (ప్రధాన నిందితురాలు). మాధురి ప్రియుడు (హత్యలో నేరుగా పాల్గొన్న వ్యక్తి). నిబంధనలకు విరుద్ధంగా నిద్రమాత్రలు సరఫరా చేసిన వ్యక్తి.

నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
#GunturCrime #MurderMystery #AndhraPradeshPolice #VakulJindal #CrimeNews #GunturDistrict #JusticeForNagaraju #BreakingNewsTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *