March 30, 2026

కొలంబియాలో కుప్పకూలిన విమానం: 15 మంది దుర్మరణం

కొలంబియా ఈశాన్య ప్రాంతంలో వెనిజులా సరిహద్దుకు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ రాజకీయ నాయకులు ఉండటంతో ఆ దేశంలో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రభుత్వ ఎయిర్‌లైన్‌ ‘సటెనా’కు చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ 1900. కుకుటా (Cucuta) నుండి ఒకానా (Ocana) వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఉదయం 11:54 గంటలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో చివరిసారిగా సంభాషించిన విమానం, గమ్యస్థానానికి కొద్ది నిమిషాల ముందే రాడార్ నుండి అదృశ్యమైంది.

విమానం అదృశ్యమైన కటాటుంబో ప్రాంతం దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలతో కూడిన క్లిష్టమైన భూభాగం కావడంతో గాలింపు చర్యలు కష్టతరమయ్యాయి. వాయుసేన, సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో గురువారం విమాన శకలాలు లభ్యమయ్యాయి. శకలాల స్థితిని బట్టి విమానంలోని వారెవరూ బతికే అవకాశం లేదని అధికారులు ధృవీకరించారు.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారులు విమాన శకలాలను సేకరించి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. నార్టే డి సాంటాండర్ రాష్ట్ర గవర్నర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#ColombiaPlaneCrash #AviationAccident #BreakingNews #InternationalNews #Tragedy #SatenaAirlines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *