March 10, 2026

మహిళలపై అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

విశాఖపట్నం, జూన్ 9:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా మహిళలపై అఘాయిత్యాలు, rapes, హత్యలు ఆగకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కేకే రాజు ఆదేశాలతో ఆమె ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ కూడలి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “రాష్ట్రంలో women and children భద్రత కరువైపోయింది. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది. హోంమంత్రి అనిత స్వయంగా మహిళ అయినా స్త్రీలకు రక్షణ కల్పించడంలో ఫెయిలయ్యారు. వెంటనే ఆమె resign చేయాలి” అని డిమాండ్ చేశారు. గత సీఎం వైఎస్ జగన్ మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని (Disha Act) తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మాజీ మేయర్ గోలగాని హరివెంకటకుమారి, మాజీ సమన్వయకర్త ఇర్లు అనురాధ, కార్పొరేటర్ నాగ శేషికల, పార్టీ నాయకురాళ్లు శ్రీదేవి వర్మ, బి పద్మావతి, రమణమ్మ, సత్యవతి, మజ్జి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఇకపోతే… పేడాడ రమణికుమారి వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలకు దారి తీసేలా ఉన్నాయి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *