
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరిలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం సమయంలో ఓ కారు పెట్రోల్ నింపుకుని రోడ్డుపైకి వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఆ కారును వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటర్పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఇందిరమ్మ కాలనీకి చెందిన సతీష్ (29)గా గుర్తించారు. ఢీకొట్టిన దెబ్బకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సతీష్ను ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు 108 అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. గాయపడిన సతీష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.