March 10, 2026

అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా అవసరాలను వివరించారు.

గతంలో అన్నమయ్య జిల్లాకు కేటాయించిన 19 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం కడప జిల్లాకు మారిన నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేటాయించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. దీనికి అవసరమైన భూమిని గుర్తించి తక్షణమే నివేదికలు పంపాలని సూచించారు. 2026 డిసెంబర్ నాటికి పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ‘ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ (FLS)’ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై కూడా దృష్టి సారించాలని, సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులకు సూచించారు.

అధికారులకు ఆదేశాలు

ఏపీఎస్పీడిసిఎల్ (APSPDCL) మరియు నెడ్ క్యాప్ (NEDCAP) ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. విద్యుత్ ఫీడర్ల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలి.

ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీడిసిఎల్ అధికారి సోమశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AnnamayyaDistrict #Madanapalle #SolarPower #APSPDCL #CollectorNishantKumar #PMKusum #GreenEnergy #AndhraPradeshNews #ElectricityProjects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *